A2Z सभी खबर सभी जिले की

మాకు న్యాయం చేస్తారా ఇక్కడే చావమంటారా

 

మెంటాడ, : 18 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వ అధికారుల లో ఎటువంటి చలనం లేదని దుర్వాసన భరించలేకపోతున్నామని మాకు న్యాయం చేస్తారా ఇక్కడే చావమంటారా ఏదో ఒకటి తేల్చాలని జనసేన మండల అధ్యక్షులు రాజశేఖర్ ఆధ్వర్యంలో బిరసాడ వలస గ్రామస్తులు తాసిల్దార్ కార్యాలయంను చుట్టుముట్టారు. బిరసాడ వలస గ్రామాన్ని ఆనుకుని ఉన్న కోళ్ల ఫారం నుండి వస్తున్న దుర్వాసన భరించలేకపోతున్నామని ఈ దుర్గంధం నుండి మాకు విముక్తి దయచేయమని కోళ్ల ఫారం ఇక్కడ నుండి తొలగించాలని 18 రోజుల నుండి జనసేన మండల అధ్యక్షుడు రాజశేఖర్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులలో ఎటువంటి స్పందన లేదని ఇక చావే శరణ్యమని అధికారులకు తెలియజేసేందుకే ఎమ్మార్వో కార్యాలయంను ముట్టడించామని బాధిత గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కోళ్ల ఫారం నుంచి వస్తున్న దుర్వాసన కారణంగా అన్నం తినలేక పోతున్నామని అనేక రోగాలు బారిన పడుతున్నామని ఎంత వేడుకున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడైనా కోళ్ల ఫారం పెట్టాలంటే ప్రభుత్వం నుండి అనేక నిబంధనలతో పాటు గ్రామానికి రెండు కిలోమీటర్లు దూరంలో ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ పక్కనే ఉన్న కోళ్ల ఫారం ను తొలగించడానికి అధికారులు ఎందుకు ఆలోచిస్తున్నారని అధికారులను నిలదీశారు. పగలు రాత్రులు అనే తేడా లేకుండా దోమలు ఈగలతో సతమతమవుతున్నామని ఎంత వేడుకుంటున్నప్పటికీ అధికారులలో మాపై కనికరం రావడం లేదని ఇకమీదట జనసేన మండల అధ్యక్షుడు సబ్బరపు రాజశేఖర్ తొను, సిపిఎం పార్టీ నాయకులతోను ధర్నాలను దీక్షలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అధికారులను హెచ్చరించారు. కోళ్ల ఫారం తొలగించాలని చేస్తున్న ధర్నాలోనూ దీక్షలోనూ అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారని ఎందుకు అధికారులు పట్టించుకోవటం లేదో అర్థం కావటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను అధికారులు పట్టించుకోకపోతే జిల్లాస్థాయిలో ఉద్యమించవలసి ఉంటుందని అధికారులు స్పందించి వారికి న్యాయం చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. అనంతరం అధికారులు తాసిల్దార్ అరుణ, ఎంపీడీవో భానుమూర్తి స్పందిస్తూ ఈ విషయమై పూర్తి వివరాలు సేకరించి న్యాయం చేసే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రాకోటి రాము, వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిరసాడ వలస గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Back to top button
error: Content is protected !!